జనసేన అధినేత పవన్ పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. వైసీపీ బంద్ నేపథ్యంలో ప్రజా పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్... భీమవరంలో ప్రజాసంఘాలతో సమావేశం కానున్నారు. మరోవైపు తుందుర్రులో ఆక్వాపార్క్ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పవన్ యాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.