గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమ్మానియేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. 'నీ మనసు నాకు తెలుసు' ఫేం ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రం ఆడియోని అక్టోబర్ తొలి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ని విజయదశమి రోజున మధ్యాహ్నాం 12 గంటలకు విడుదల చేయబోతున్నారు. 'లౌక్యం' తరువాత సరైన హిట్ లేని గోపీచంద్కి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. అక్టోబర్ 27న 'ఆక్సిజన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.