వ్యక్తిని దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఘంటా ప్రసాద్(36) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.