ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం టాకీ పార్ట్ దాదాపు కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అరవింద సమేతలో అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: పీయస్ వినోద్.