లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వారి సీట్లలో సైలెంట్గా కూర్చొన్నారు. అంతకు ముందు ప్లకార్డులతో హడావిడి చేసిన ఎంపీలు తమ స్ట్రాటజీ ప్రకారం మౌనం వహించారు. దీంతో ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్, వైసీపీ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గందరగోళం మధ్యే మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది.