వైసీపీ సాయాన్ని అభినందించిన టీడీపీ ఎంపీ

Update: 2018-10-16 11:15 GMT

‘తిత్లీ’ తుపాన్ తో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తమ వంతు సాయం ఇప్పటికే ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి’’ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

Similar News