ఆసుపత్రిలో ఎంపీ కవిత.. పరామర్శించేందుకు వెళ్లనున్న కేసీఆర్

Update: 2018-10-16 08:57 GMT

టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ ఎంపీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఎంపీ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో ఆమె తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లు ఆసుపత్రికి వెళ్లనున్నారు. వాస్తవానికి ఈరోజు ఆమె జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అనారోగ్యం కారణంతో ఆమె పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. 
 

Similar News