అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న స్ధానిక ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ వడదెబ్బకు గురయ్యి స్పృహ తప్పి పడిపోయారు. కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఆయన ... మీడియా మాట్లాడుతూ ఒక్కసారిగా కూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం ధర్మవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.