జగన్‌కు లోకేష్‌ కౌంటర్‌

Update: 2018-04-07 05:38 GMT

వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రో కో నాటకం మొదలుపెట్టారని ట్విట్‌ చేశారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, వైసీపీ ఎంపీలు... మోడీ కాళ్ల మీద పడుతూ, పిఎంఓ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. మోడీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారంటూ లోకేష్‌ మండిపడ్డారు.

Similar News