ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు @ysjagan గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
— KTR (@KTRTRS) October 25, 2018