జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కేటీఆర్

Update: 2018-10-25 11:47 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
 

Similar News