వైసీపీ అధినేత జగన్ ఎంపీల రాజీనామా పేరుతో మరో నాటకానికి తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. విశ్వసనీయత లేకపోతే ఏ నేతా మనుగడ సాగించలేరని చంద్రబాబుతో భేటీ తర్వాత అన్నారు. కొందరు విమర్శిస్తున్నట్లుగా టీడీపీ ప్రత్యేక హోదాను త్యాగం చెయ్యలేదన్న అచ్చెన్నాయుడు...ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని చెప్పారు. అయినా టీడీపీ నేతలకు పదవులు పెద్దవిషయం కాదని..తాము త్యాగాలకు వెనకాడేరకం కాదని చెప్పుకొచ్చారు.