నాలుగేళ్ల తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్స్టాప్ పెడుతూ విరాట్ కోహ్లీ, అనుష్క లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇటలీ వైన్ రాజధానిగా పేరు తెచ్చుకున్న మోంటాల్కినోకు గంట ప్రయాణం దూరంలో ఉన్న ఓ రిసార్ట్ లో వివాహం ఘనంగా జరిగింది. అయితే వీరి వివాహం చెల్లుబాటు కాదనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. సోషల్ మీడియాలో ఓ వర్గం వారు విరాట్-అనుష్క ఇండియాలో పెళ్లి చేసుకోలేదని..జర్మనీలో పెళ్లి చేసుకున్నారని..కాబట్టి వీరి వివాహం ఇండియాలో చెల్లదని అంటున్నారు. అంతేకాదు వీరిద్దరు మళ్లీ పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చని సూచిస్తున్నారు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నకోహ్లీ - అనుష్క శర్మ వారి పెళ్లి పై ఎలా స్పందిస్తారో చూడాలి.