నటుడు కెప్టెన్ రాజు (68) మృతిచెందారు. గత కొంతకాలంగా గుండె సంబంధించిన సమస్యతో బాధపడుతున్న కెప్టెన్ రాజు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్కు విమానంలో వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి, కొచ్చిలోని ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ కెప్టెన్ రాజు తుదిశ్వాస విడిచారు. అయన మొదట్లో భారత సైనిక దళంలో సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారిగా 'రక్తం' అనే మలయాళ చిత్రంలో నటించారు. అనంతరం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు.