మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తున్నానని.. దానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పెడుతున్నానని సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి నిర్మాతగా వ్యవహరించనున్నాడని తాజాగా వార్తలు వినిపించాయి.
అయితే అందులో వాస్తవం లేదని స్వయంగా వర్మనే చెప్పుకొచ్చాడు. తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఎవరు నటించనున్నారు, ఈ సినిమాకి ఎవరు నిర్మాతగా వ్యవహారించనున్నారు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.