జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో, ఉసరవెళ్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది, అలిసిపోయి ఉన్నారని పవన్ కల్యాన్ ట్వీట్ చేశారు. మీ నోటితో ప్రజల మీద చేసే అఘాయిత్యాలు ఆపేయాలని, ఇక భరించలేకుండా ఉన్నామని చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విరుచుకపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో రోడ్డుపై ఏర్పడిన భారీ పగుళ్లపై పవన్ స్పందిస్తూ, చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ దృష్టికి ఈ విషయం వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని, ఏకారణం వల్ల జరిగిందో ప్రజలకు స్పష్టం చేయాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు.