కుల దురహంకారంతోనే పిల్లలపై పెద్దలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ కేసు మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ ఎస్సార్ నగర్ ప్రాంతంలో ఓ యువతి తండ్రి కూతురిపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన సందీప్ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాంతో పరువుపోయిందన్న కారణంగా కొబ్బరిబోండాలు నరికే కత్తితో కూతురు, ఆమె భర్తపై దారుణానికి పాల్పడ్డాడు మనోహర చారి. ముందుగా అమ్మాయి తండ్రి ఫోన్ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. సందీప్ సోదరుడు చెప్పిన విషయాల ప్రకారం..వారిద్దరూ పెళ్లి చేయూసుకుని ఐదు రోజులే అవుతుందని.. వారిద్దరూ 10వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారని. తమది మాల కుటుంబం. అమ్మాయిది విశ్వబ్రాహ్మణ కులం. ఇద్దరు మేజర్లే అని తెలిపాడు. పెళ్లి అయిన తరువాత వాళ్ల కుటుంబం వచ్చి మా పాపను మంచిగా చూసుకోండి అని చెప్పారు. అంతేకాకుండా రిసెఫ్షన్ కూడా ఏర్పాటు చేస్తామని నమ్మించాడని సందీప్ సోదరుడు వెల్లడించాడు.