టీ20లో దుమ్మురేపిన రోహిత్ శర్మ

Update: 2017-12-22 15:49 GMT

భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ దుమ్ము రేపాడు. చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లకు దడ పుట్టించాడు. రోహిత్ శర్మ రికార్డ్ సెంచరీ సాధించాడు. టీ20ల్లో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లోనే 101 పరుగులను రోహిత్ సాధించాడు. టీ20ల్లో వేగవంతమైన శతకం రికార్డును రోహిత్ సమం చేశాడు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్ మిల్లర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.. 43 బంతులకు 118 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 

Similar News