హిజ్రాల మధ్య భగ్గుమన్న వర్గ విబేధాలు

Update: 2018-01-26 06:56 GMT

నెల్లూరు నగరంలో హిజ్రాల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన హిజ్రాలు పరస్పరం కత్తులు, మారణాయుధాలతో దాడులు చేసుకున్నాయి. గత రాత్రి అలేఖ్య వర్గం రెచ్చిపోయి నగర శివారులోని దీనదయాళ్ నగర్ లో ఉన్న షీలా వర్గంపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో మారణాయుధాలు సహా ముగ్గురిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలేఖ్య వర్గంతో విభేదించడం వల్ల కొద్దికాలంగా తమపై దాడులు చేస్తున్నారని షీలా వర్గం హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News