రోజాపై కామెంట్స్: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Update: 2018-09-18 07:58 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే రోజా తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 

Similar News