సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్లో సెటైర్లు వేశారు. చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్ డైపర్లు వేసుకునే వాడని అన్నారు. అలాంటి బచ్చా అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీ వెళ్లడం సిగ్గనిపించడం లేదా అంటూ జీవీఎల్ చంద్రబాబును ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చడం కాదా అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు గారు 1978 లో MLA,1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు. అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే @ncbn కి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా?
— GVL Narasimha Rao (@GVLNRAO) November 1, 2018
ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా? pic.twitter.com/lahgr4HXjJ