జగన్ పై దాడి... ఏపీ డీజీపీకి గవర్నర్ ఫోన్

Update: 2018-10-25 09:04 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. వైఎస్‌ జగన్‌పై దాడి నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేశారు. దాడిపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు. ఇదే ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీని కలిసి జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయనున్నారు. 
 

Similar News