సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల సెగ!

Update: 2018-01-17 12:01 GMT

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు మత్స్యకారుల సెగ తగిలింది. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నోవాటెల్‌ హోటల్‌కు రానున్న నేపథ్యంలో హోటల్‌ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హోటల్‌కు ఎదురుగా ఉన్న సముద్రంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున జలదీక్ష చేపట్టారు. తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ మత్స్యకారులు గతకొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీక్ష చేపట్టారు మత్స్యకారులు.
 

Similar News