ఎన్నికల సర్వేల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తనదైన శైలీలో ప్రత్యర్ధులకు దిమ్మతిరిగే రిపోర్టు ఇచ్చారు లగడపాటి. జాతీయ ఛానల్స్ అన్నీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వే ఇస్తే జాతీయ ఛానల్స్ ధీటుగా లగడపాటి సర్వే ఫలితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లగడపాటి రాజగోపాల్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శించుకోవాడానికి వచ్చారు. తిరుచానూరు పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి సర్వే పడిపోవడంపై లగడపాటి రాజగోపాల్ను మీడియా ప్రశ్నించగా దాని లగడపాటి స్పందిస్తూ " నో కామెంట్" అని మెళ్లిగా అక్కడి నుండి జరుకున్నాడు.