కథానాయకుడిగా ఎన్టీఆర్, నిర్మాతగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'జైలవకుశ'. తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్లు రాబట్టిన 'జైలవకుశ'.. నాలుగో రోజు అయిన ఆదివారం కూడా వసూళ్ల పరంగా అదరగొట్టింది.
దాదాపు రూ.90 కోట్లని గ్రాస్ రూపంలోనూ.. రూ.54 కోట్లని షేర్ రూపంలోనూ ఈ సినిమా రాబట్టుకుంది. సోమవారం కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా దసరా సెలవులు 'జైలవకుశ'కి బాగానే ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి.