ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలైంది. అనంతపురం జిల్లా పట్నం గ్రామానికి చెందిన ప్రియాంక మదనపల్లిలోని గోల్డన్ వ్యాలీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. కళాశాలలో చేరినప్పటి నుంచి ప్రియాంకను విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ర్యాగింగ్పై ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ వేధింపులు అధికమవడంతో వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకుంది.