టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మంత్రుల నివాస ప్రాంగణం, ఇతర అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మహాకూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు సీఈవో నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక తొలిసారిగా, అది కూడా అధికార పార్టీకి నోటీసులు జారీ అయ్యాయి. టీఆర్ఎస్కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.