కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లను శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశాక ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో రోజుకో మలుపు తిరుగుతోంది. వాళ్లిద్దరినీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని సింగిల్ బెంచ్ గతంలో ఆదేశించింది. ఐతే.. ఇవాళ ఈ కేసును విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పుపై రెండు నెలలు స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.