బ్రేకింగ్... హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురుదెబ్బ!

Update: 2018-08-21 07:09 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశాక ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో రోజుకో మలుపు తిరుగుతోంది. వాళ్లిద్దరినీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని సింగిల్ బెంచ్ గతంలో ఆదేశించింది. ఐతే.. ఇవాళ ఈ కేసును విచారించిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై రెండు నెలలు స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో  తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.

Similar News