కర్నూల్ బై రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. మోడీ ప్రభుత్వం కొంత మంది కార్పోరేట్ల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని అభిప్రాయపడ్డారు. చైనాలో రోజుకు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంటే భారత్లో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.