నేటి వరకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠతకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. గత ఐదురోజులుగా సుదీర్ఘమంతానాల తరువాత మొత్తానికి కొత్త ముఖ్యమంత్రిగా భూపేష్ బాఘెల్ పేరును అధిష్ఠానం ఖరార్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సభాపక్ష బైఠక్ లో భూపేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీవ్ర కసరత్తు అనంతరం బుపేశ్ పేరును కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ సోమవారం కొత్తముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్ 1986లో యూత్ కాంగ్రెస్లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.