ఆ ఘనత టీడీపీ ప్రభుత్వానిదే : చంద్రబాబు

Update: 2018-06-04 12:20 GMT

ఒక్కో రైతుకు లక్షన్నర చొప్పున రుణ మాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణ మాఫీ చేయలేదని విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఆర్బీఐ రైతు రుణ మాఫీకి అంగీకరించకపోయినా..ఇచ్చిన మాటకు కట్టుబడి  అన్నదాత అప్పుల్ని రద్దు చేశామని చెప్పారు. గతంలో రైతులకు ఎన్నో కష్టాలుండేవని..కానీ టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులను అప్పల ఊబి నుంచి బయటకు తెచ్చామని చంద్రబాబు అన్నారు.  

Similar News