అన్నను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

Update: 2018-08-29 07:24 GMT

బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. అయన మృతితో కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలివచ్చారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి భౌతికాయాన్నిచూసి ఇక మాకు దిక్కెవరంటూ ఏడ్చారు. కాగా అన్న మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తమ్ముడు బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆస్పత్రిలో  అన్న మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

Similar News