అలిపిరిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షా వాహనంపై దాడికి ప్రయత్నించిన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కార్యకర్తలనుి ఆదేశించారు. పార్టీకి చెడ్డపేరు వచ్చే ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి .. తమ పోరాటంలో ఘర్షణలు, ఉద్రిక్తలకు అవకాశం లేదని చంద్రబాబు చెప్పారు.