తప్పతాగిన ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చాడు. చిత్తుగా మందు కొట్టిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీను ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టాడు, ప్రమాదానికి గురైన బైక్ మీద వస్తున్న తేజస్విని, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన తేజస్విని బ్రెయిన్ డెడ్గా అయినట్లు డాక్టర్లు గుర్తించారు.
ఈ విషాద ఘటన మోన్న అర్థరాత్రి విజయవాడలో జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన తేజస్విని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమె సోదరుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ను శ్రీనుగా గుర్తించారు.