కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ

Update: 2019-10-04 07:29 GMT

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ప్రస్తుతం $5.40శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి $5్‌.15శాతంగా నిర్ణయించింది. రివర్స్‌ రెపో రేట్‌ను 4.80శాతం, బ్యాంక్‌ రేట్‌ను క్‌.40శాతంగా నిర్ణయించారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీని (.9శాతం నుంచి 6.1శాతానికి, 2020-21 సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్బీఐ .2కు సవరించింది. శుక్రవారం జరిగిన పరపతి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మందగమనం దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినట్లుగా భావిస్తున్నారు. 

Tags:    

Similar News