రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నా పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం తో పోలిస్తే బుధవారం పెట్రోల్ ధరలు యధాతథంగా ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.25 రూపాయలకు చేరింది. డీజిల్ 73.51 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 78.90 రూపాయలు గానూ, డీజిల్ ధర 72.83 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.78.40, డీజిల్ ధర 72.37 రూపాయలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబయిలో పెట్రోల్ ధర 80.21 రూపాయలు, డీజిల్ 70.76 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 74.61 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.49 రూపాయలుగానూ ఉంది.