Pinnelli: ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో వైరల్
Pinnelli: పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం 202లో ఘటన
Pinnelli: ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో వైరల్
Pinnelli: ఏపీలో పోలింగ్, అనంతరం చోటు చేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా...మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.