వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అరెస్ట్

Update: 2019-02-25 13:14 GMT

ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టంగుటూరు మండలం కమ్మపాలెంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తలపెట్టిన 'రావాలి జగన్, కావాలి జగన్' కార్యక్రమాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో అదే ఊరికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలను తరిమికొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. రెండు పార్టీ పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయిందన్న కారణంతో బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలినేని అరెస్టుతో టంగుటూరు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ.. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు.

Similar News