జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువయ్యిందన్నారు జేసీ దివాకర్రెడ్డి. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అధికారులు వేధిస్తున్నారన్నారు జేసీ. అసలు బస్సుల బిజినెస్ను కొంతకాలం మానేయాలి అనుకుంటున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల గొడవకంటే కొంతకాలం వ్యాపారం ఆపేస్తేనే బాగుంటుందనిపిస్తోందని వ్యాఖ్యానించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక, పార్టీ మారేవాళ్లు పార్టీ అధినేతను ఏదో ఒకటి అనాలి కదా.. అంటూ ఎద్దేవా చేసిన జేసీ వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని సూచించారు.
Keywords : Andhra Pradesh, JC Diwakar Reddy, travels business, Diwakar Travels