TTD: శ్రీవారి దర్శనంపై ఆంక్షలు.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

TTD: రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్‌తో భక్తులు రావాలన్న టీటీడీ

Update: 2021-09-22 08:45 GMT
వాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన టీటీడీ (ఫైల్ ఇమేజ్)

TTD: తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న సర్టిఫికెట్‌తో భక్తులు రావాలని టీటీడీ సూచించింది. కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో వచ్చినా దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇక.. ఈ నెల 25న ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. రోజుకు 8వేల టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. 24న 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 

Tags:    

Similar News