ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

Update: 2019-10-19 04:58 GMT

నిజామాబాద్‌ జిల్లా మక్లూర్ మండలం దాస్‌ నగర్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిజమాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బంద్ లో పాల్గొన్న కార్మికులతో పాటు మహిళ కాండక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేస్తున్నారు.  

Tags:    

Similar News