కరోనా భయమా.. ఓటమి జ్వరమా: కేశినేని నాని
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో స్పందించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో స్పందించారు. కరోనా భయమా.. లేక ఓటమి జ్వరమా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కరోనా ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది.
ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. 6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి కొత్త షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు.
కరోనా భయమా...!
— Kesineni Nani (@kesineni_nani) March 15, 2020
ఓటమి జ్వరమా...!@ysjagan