టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. ఈ ఉదయం తన అనుచరులతో సమావేశమైన కర్నూలు జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్న ఆయన. కర్నూలు కార్పొరేషన్లో టీడీపీ వారికి టికెట్లు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కోట్ల వర్గీయులకు టికెట్లు కేటాయింపులు చేస్తున్నారని ఏ పార్టీలో చేరేదే త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.