బ్రేకింగ్ : సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..వైసీపీలో చేరుతారంటూ ప్రచారం..
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్తో భేటి అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో వంశీ సమావేశమయ్యారు . ఈ రోజు ఉదయమే ఎంపీ సుజనా చౌదరితో భేటి అయిన వంశీ పలు అంశాలపై చర్చించారు. అంతలోనే సీఎం జగన్తో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే వంశీ వైసీపీలో చేరుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది.