జగన్‌ విసిరిన సవాల్ ఏమైంది..? : అచ్చెన్నాయుడు

Update: 2019-12-09 05:58 GMT
అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై అధికార, విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలాయి. 23 ఎంపీలను గెలిపిస్తే హోదా తెస్తామన్న జగన్‌ సవాల్‌ ఏమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీ మెడలు వంచి హోదా సాధిస్తామని ప్రగల్బాలు పలికారని మెజార్టీ సీట్లు సాధించినా హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు.

జగన్ సర్కారు పీపీఏలపై సమీక్ష చేపట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. దీనిపై కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ పంపించిందని గుర్తు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News