Ashok Gajapathi Raju: వైసీపీ తీరుపై నిప్పులు చెరిగిన అశోక్ గజపతి

*జిల్లా కలెక్టర్ కార్యాలయాలను కూడా తాకట్టు పెడతారా: అశోక్ గజపతి *కేంద్రం, రాష్ట్రం దొందూ దొందే అంటున్న అశోక్ గజపతి

Update: 2021-10-07 10:40 GMT

అశోక్ గజపతి రాజు(ఫైల్ ఫోటో)

Ashok Gajapathi Raju: ఏపీలో తెలుగు భాషపై కుట్ర జరుగుతోందని విమర్శిస్తున్నారు టీడీపీ నేత అశోక్ గజపతి.. ప్రపంచమంతా తల్లి భాషలోనే విద్య కొనసాగిస్తుంటే ఏపీలో మాత్రం తెలుగు భాషకు తూట్లు పొడుస్తున్నారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయలేదు కాబట్టే అప్పట్లో తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని, విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని అశోక్ గజపతి రాజు ఫైర్ అయ్యారు. గ్యాస్ ధరల పెంపుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజాసౌకర్యాలను తాకట్టు పెట్టేస్తోందని, చివరికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలనూ తాకట్టు పెడతారా అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News