Amaravati: తప్పుడు హామీలతో బీసీలను మోసం చేస్తున్న వైసీపీ: యనమల

తప్పుడు హామీలతో బీసీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మరోసారి బహిర్గతమైంది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

Update: 2020-03-02 13:00 GMT
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (ఫైల్ ఫోటో)

అమరావతి: తప్పుడు హామీలతో బీసీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మరోసారి బహిర్గతమైంది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందడుగు వేశారన్నారు.

రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా..బీసీలను మోసం చేయాలని చూడటం స్పష్టమైందని పేర్కొన్నారు.బడ్జెట్‌లోనూ బీసీల సంక్షేమానికి కోత విధించారన్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ఎన్నికలను వాయిదా వేయించేందుకే..ఇలాంటి చిల్లర రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు.


Tags:    

Similar News