Independence Day 2020: జాతీయ జెండా ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు..

Independence Day 2020: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

Update: 2020-08-15 09:46 GMT
Chandrababu Naidu Flag Hosting (Twitter Photo)

Independence Day 2020: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. చిరుజల్లుల నడుమ జెండా వందనం సమర్పించిన ఆయన అనంతరం భరతమాత, గాంధీజి చిత్రపటాలకు పూలమాల వేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.


మరోవైపు చంద్రబాబు నాయిడు తనయుడు నారా లోకేష్ కూడా తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి పతాకావిష్కరణలో పాల్గొన్నారు. దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరవీరులు, ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుందాం అంటూ.. పిలుపునిచ్చారు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వారు మాకు ఇచ్చిన కనుక అంటూ నరలోకేష్ త్వీట్ చేసారు. 


Tags:    

Similar News