Anantapuram: ఎస్‌ఎస్‌బీయన్‌ ఎయిడెడ్‌ కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా

* విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ * ఎయిడెడ్‌ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

Update: 2021-11-08 06:29 GMT

అనంతపురంలో ఉద్రిక్తత(ఫైల్ ఫోటో) 

Anantapuram: అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌ఎస్‌బీయన్‌ ఎయిడెడ్‌ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్‌ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

దీంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News