శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. ఆత్మహత్య చేసుకొని ఉంటారని సమాచారం. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సెలవులో ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.