టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన నాయకులు

Update: 2019-02-22 16:17 GMT

ఎన్నికల ముందు ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైసీపీ లలోకి నేతలు దూకేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక​ అరుణ్‌ కుమార్‌, నందిగామ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రావు ముఖ్య పాత్ర పోషించారు.  

Tags:    

Similar News