ఎన్నికల ముందు ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైసీపీ లలోకి నేతలు దూకేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, నందిగామ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రావు ముఖ్య పాత్ర పోషించారు.